అనుమానాస్పదస్థితిలో వివాహిత ఆత్మహత్య


కోహెడ(సిద్ధిపేట జిల్లా): అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కోహెడ మండలం వింజపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు..వింజపల్లి గ్రామానికి చెందిన మౌరవ్వ(22)కు ఏడాది క్రితం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. వీరిద్దరూ శనివారం వింజపల్లి వచ్చారు. ఏమైందో ఏమో కానీ ఆదివారం ఉదయం మౌరమ్మ ఉరి వేసుకొని మృతి చెందింది. ఉదయంపూట భర్త ఇంట్లో లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top