వివాహిత ఆత్మహత్య
జనగామ: కుటుంబ కలహాలతో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంన్న ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బలబోయిన అనూష(22) శనివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. అదనపు కట్నం కోసం అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యలా చిత్రికరించేందుకు యత్నిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.