దంపతుల ఆత్మహత్య
సత్తెనపల్లి: గుంటూరుజిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన జొన్నలగడ్డ జ్ఞానానందం(25) (చిన్నోడు), శైలజ(22)లు భార్యాభర్తలు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి ఇద్దరూ భోజనం చేసి నిద్రించారు. తెల్లవారినా లేవకపోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా వారు విగతజీవులై ఉన్నారు.
భోజనం చేశాక ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి నిద్రించి ఉంటారని, నిద్రలోనే చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం శైలజ నిండు గర్భిణి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.