‘మనలోఒక్కడు’ హిట్ కావాలని ప్రార్థించా
– సినీ నిర్మాత గురుజాల జగన్మోహన్
అలంపూర్రూరల్ : ‘మనలోఒక్కడు’ సినిమా సూపర్ హిట్ కావాలని, ప్రేక్షకుల అనుగ్రహం ఉండాలని జోగుళాంబను ప్రార్థించినట్టు ఆ సినిమా నిర్మాత గురుజాల జగన్మోహన్ తెలిపారు. శుక్రవారం ఆయన తన మిత్రులతో కలసి 5వ శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబను దర్శించుకున్నారు. చిత్తూరు నుంచి హైదరాబాద్కు వెళుతూ మార్గమద్యంలో శక్తి పీఠాన్ని దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. శనివారం హైదరాబాద్లో మనలోఒక్కడు సినిమా ఆడియో రిలీజ్ ఉన్నట్టు, కార్యక్రమం విజయవంతం కావాలని అమ్మవారి ఆశీస్సులు కోరినట్టు తెలిపారు. వీరి వెంట బాబురెడ్డి, సంతోష్, వెంకటేశ్వర్లు, నందగోపాల్, లింగరాజు తదితరులు ఉన్నారు.