వ్యక్తిని కాపాడిన ‘పోలీస్‌మిత్ర’

వ్యక్తిని కాపాడిన ‘పోలీస్‌మిత్ర’ - Sakshi


మంచిర్యాల : ఆత్మహత్యకు యత్నించిన ఒకరిని పోలీస్‌మిత్రలో వలంటరీగా పనిచేస్తున్న ఎడ్లవాడకు చెందిన నవీన్‌ కాపాడాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సుధాకర్‌ తెలిపిన వివరాలు.. జార్కండ్‌కు చెందిన సంతోష్‌పర్దాన్‌ ఇటీవల మంచిర్యాల శివారులోని తొల్ల వాగువద్ద ఏర్పాటు చేసిన సర్కస్‌లో పనిచేస్తున్నాడు. కొంతకాలం భార్య,భర్తల మధ్య తగాదాలు ఉన్నాయి.



ఈ క్రమంలో సర్కస్‌ యజమాని, సంతోష్‌పర్దాన్‌కు మంగళవారం గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష్‌పర్దాన్‌ ప్లైఓవర్‌బ్రిడ్జి సమీపంలోని రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించగా, గమనించిన పోలీస్‌మిత్ర వలంటరీ నవీన్‌ అతన్ని కాపాడాడు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన నవీన్‌ను సీఐ సుధాకర్‌ అభినందించారు. సంతోష్‌పర్దాన్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top