కరెంటుషాక్ తో యువకుడి మృతి
అనకాపల్లి: విద్యుధ్ఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మాటూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకట మహేష్ రాజ(28) విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ లేబర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సబ్స్టేషన్ వద్ద మరమ్మత్తులు నిర్వహిస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు