రూ.80 లక్షల విలువైన బర్రెలతో పరార్

రూ.80 లక్షల విలువైన బర్రెలతో పరార్ - Sakshi


ఒంగోలు: పెద్ద వ్యాపారినని పోజు కొట్టాడు. రైతులను నమ్మించి బర్రెలను కొనుగోలు చేశాడు. నాలుగు రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి.. రూ. 80 లక్షలు విలువ చేసే 80 బర్రెలతో పరారయ్యాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..



పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన సోమశేఖర్ గత నెల రోజుల నుంచి మార్కాపురం పట్టణంలోని విద్యా నగర్ లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. పశువుల వ్యాపారం చేస్తుంటానని స్థానిక రైతులతో నమ్మబలికాడు. ఈ క్రమంలోనే 20 మంది రైతులకు చెందిన 80 బర్రెలను కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపాడు. సెప్టెంబర్ 10న డబ్బులు ఇస్తానని చెప్పి పశువులను స్వాధీనం చేసుకున్నాడు.



ఉన్నట్టుండి గత గురువారం బర్రెలతో సహా కనిపించకుండా పోయాడు. విషయుం తెలుసుకున్నబాధితులు శనివారంపోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రా్యదు చేశారు. దీనిపైపోలీసులు కేసు నవెూదు చేసిదరా్యపు్త్రపారంభించారు. 80 బర్రెలవిలువ సుమారు రూ. 80 లక్షలు ఉంటుందని అంచనా.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top