తండ్రి అస్థికలు కలిపేందుకు వెళ్లి..ఎన్ఆర్ఐ మృతి
నల్లగొండ(దామరచర్ల):
తండ్రి అస్థికలు కలిపేందుకు వెళ్లిన తనయుడు ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలో వాడపల్లిలో చోటు చేసుకుంది. కట్టంగూర్కు చెందిన ఇల్లెందుల అనిల్కుమార్(38) పదిహేను రోజుల క్రితం తన తండ్రి వెంకటేశ్వర్లుకు ప్రథమ సంవత్సరీకం చేసేందుకు దక్షిణ ఆఫ్రికా నుంచి స్వగ్రామం వచ్చాడు.
దక్షిణ ఆఫ్రికాలోని జోహన్స్బర్గ్లో గల ఆఫ్రికన్ బ్యాంకులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇంట్లో ప్రథమ సంవత్సరిక కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం అనిల్కుమార్, తన సోదరుడు పవన్ కుమార్తో కలిసి తండ్రి అస్థికలు కలిపేందుకు కృష్ణానది వద్దకు వచ్చా డు. బ్రాహ్మణుల క్రతు వు ముగిసిన అనంతరం నదిలో పిండ ప్రదానం చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయారు.
గమనించిన పడవ డ్రైవర్ సోమయ్య పవన్కుమార్ను రక్షించగా అనిల్ కుమార్ నీటిలో మునిగిపోయాడు. జాలార్ల సాయంతో వెతకగా కాసేపటికి అనిల్కుమార్ మృతదేహం లభ్యమైంది. దీంతో కట్టంగూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామన్గౌడ్ తెలిపారు.
సంబంధిత వార్తలు