అది రోడ్డు ప్రమాదం కాదు.. హత్య!

అది రోడ్డు ప్రమాదం కాదు.. హత్య! - Sakshi


రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఘటనపై పలు అనుమానాలు

హత్యకు గురయ్యాడన్న సమాచారంతో ఆ కోణంలో విచారణ

పోలీసుల అదుపులో ఐదుగురు తండావాసులు!




బొల్లాపల్లి (వినుకొండ) : వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పలు రకాల వదంంతులు విన్పిస్తున్నాయి. మండలంలోని కనుమలచెర్వు పంచాయతీ శివారు బ్రిడ్జి తండాలో ఈ నెల 11న ఉదయం గుర్తు తెలియని ఆటో డీకొని భూక్యా రూప్లానాయక్‌ (42) మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బండ్లమోటు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో ఇటీవల పోలీసులకు అజ్ఞాత వ్వక్తి ఫోన్‌ చేసి రూప్లానాయక్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని, హత్యకు గురయ్యాడని సమాచారం అందజేసినట్లు మండలంలో పుకార్లు విన్పిస్తున్నాయి.



దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా బ్రిడ్జితండాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యులు సైతం రూప్లానాయక్‌ హత్య చేయబడ్డాడని పోలీసుల వద్ద వాపోయారని తెలుస్తోంది. కేసు కొత్త మలుపు తిరగడంతో ఈ ఘటన తండాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై బండ్లమోటు ఎస్సై ఎంవీ చరణ్‌ను వివరణ కోరగా ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దాంతో అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top