ట్యాంకర్‌ పేలి వ్యక్తి దుర్మరణం

ట్యాంకర్‌ పేలి వ్యక్తి దుర్మరణం

 

తాళ్లరేవు (ముమ్మిడివరం) :

చెరువులకు ఆక్సిజ¯ŒS అందించేందుకు ఏర్పాటు చేసిన ఆక్వా గాలిమర ఒక వ్యక్తి ప్రాణం తీసింది. తాళ్లరేవు మండలం పటవల పంచాయతీలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రొయ్యల చెరువు వద్ద ఎంఆర్‌ గ్లోబల్‌ అండ్‌ మెరై¯ŒS సర్వీసెస్‌ సంస్థ ఏర్పాటు చేసిన గాలిమరకు అమర్చిన ఆక్సిజ¯ŒS ట్యాంకర్‌ పేలిపోవడంతో అదే గ్రామానికి చెందిన ఆక్వా రైతు నరాల అప్పారావు (41) మృతి చెందారు. శుక్రవారం కోరంగి ఎస్సై బి.శ్రీనివాసరావు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పదేళ్లుగా చెరువులను సాగుచేస్తున్న అప్పారావు  గురువారం రాత్రి చెరువులకు ఆక్సిజ¯ŒS సరఫరా చేసేందుకు గాలిమర స్విచ్‌ ఆ¯ŒS చేశాడు. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆక్సిజ¯ŒS ట్యాంకర్‌లో గాలి వత్తిడి ఎక్కువైంది.  ప్రెజర్‌ను రెగ్యులేట్‌ చేయడానికి ట్యాంకర్‌ రిలీఫ్‌ వాల్వును ఓపె¯ŒS చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ట్యాంకర్‌ పేలడంతో దాని పై భాగాన ఉన్న ప్లేట్‌ ఎగిరి సుమారు 50 మీటర్ల దూరంలో పడింది. ఆ శబ్దం చాలా దూరం వరకు వినిపించినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. కాగా ఈ ప్రెజర్‌కు అప్పారావు సైతం చెరువులో ఎగిరిపడ్డాడు. ప్లేట్‌ అప్పారావు మర్మాంగాలకు గట్టిగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ వత్తిడికి అప్పారావు ఎడమకాలు నుజ్జునుజ్జు అయ్యింది. ఎస్సై బి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.  అప్పారావుకు  భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు గతేడాది వివాహం చేశాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

పలువురి పరామర్శ : మృతుని కుటుంబ సభ్యులను స్థానిక ఎంపీటీసీలు దంగేటి శ్రీనివాసరావు, దోణం ఆదిసత్యనారాయణ, ఎస్‌ఎంసీ కమిటీ చైర్మ¯ŒS టేకుమూడి లక్ష్మణరావు, మాజీ సర్పంచ్‌ కాలా సూరిబాబు, వైఎస్సార్‌సీపీ గ్రామకమిటీ కన్వీనర్‌ కాలా వెంకటరమణ, కొత్తూరు కాశీ తదితరులు పరామర్శించి ఓదార్చారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top