వైఎస్సార్‌సీపీ తెలంగాణ మైనారిటీ సెల్ కార్యదర్శిగా మాజీద్ ఖాన్


 వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన మాజీద్ ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మతిన్ ముజాహిదీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీద్ ఖాన్ సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ....దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ముస్లిం మైనార్టీలకు న్యాయం జరిగిందన్నారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం ప్రజలు వైఎస్సార్‌సీపీ పట్ల ఆధరాభిమానాలు కురిపిస్తున్నారన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో పదవి అప్పగించినందుకు గాను పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్‌లకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top