సిద్ధాపూర్‌కు 'మహేష్‌బాబు' ప్రతినిధులు

సిద్ధాపూర్‌కు 'మహేష్‌బాబు' ప్రతినిధులు - Sakshi


కొత్తూరు (మహబూబ్‌నగర్) : సిద్దాపూర్ గ్రామ పెద్దలతో హీరో మహేష్‌బాబు ముఖాముఖికి తేదీ ఖరారైంది. గ్రామస్తులతో ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో ఆయన సమావేశం కానున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామానికి దత్తత తీసుకోనున్నట్లు గత నెల 28వ తేదీన ప్రిన్స్ మహేష్‌బాబు ప్రకటించిన విషయం విదితమే. దీంతో తమ అభిమాన హీరో ఎప్పుడెప్పుడు వస్తారోనని ఆ పల్లెవాసులు ఎదురుచూస్తున్నారు. అయితే వివిధ కారణాలతో ఆయన అక్కడికి వెళ్లలేదు.



గ్రామానికి సంబంధించి సమగ్ర సమాచారం సేకరించేందుకు మంగళవారం మహేష్ బాబు తన ప్రతినిధులు కొందరిని అక్కడకు పంపించారు. వారు స్థానిక నేతలతో సమావేశమై ప్రధాన సమస్యలు, పరిష్కారాలపై చర్చలు జరిపారు. ఈ  ప్రతినిధి బృందంలో కందుకూరి భూపాల్‌రెడ్డి, మధు, కృష్ణ, మహేష్ ప్రజాసేన రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ ఘోరీ తదితరులు ఉన్నారు. వారు సర్పంచ్ నర్సమ్మ, ఎంపీటీసీ బాలయ్యతో పాటు యువకులు, నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో మహేశ్‌బాబు.. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ బాలయ్య, తదితరులతో దత్తతపై చర్చించనున్నట్లు వారు వెల్లడించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top