ప్రేమికుల ఆత్మహత్య


రాయగడ: రాయగడ జిల్లా మునిగుడ సమితి హట్‌శేశికళ ప్రాంతానికి సమీపంలో కుంతుబడి రైల్వేస్టేషన్‌ పరిధిలో గూడ్సు రైళ్లు కిందపడి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వీరి వివరాలు తెలియరాలేదు. వీరికి వచ్చిన సమస్య ఏమిటి, వీరు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి అనే సమాచారం తెలియరాలేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనేది తెలియడం లేదు. అయితే వీరి మృతదేహాల పక్కన ఉత్తరాలు పోలీసులకు లభించినట్టు తెలిసింది. ఈ ఘటనపై మునిగుడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top