పారాణి ఆరక ముందే..

రమేశ్, మాధవి (ఫైల్) - Sakshi


ప్రాణం తీసుకున్న ప్రేమజంట

మల్లన్నగుట్ట సన్నిధిలో పెళ్లి చేసుకుని..

ఆపై బలవన్మరణం


 వెల్దుర్తి: పారాణి ఆరక ముందే ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మల్లన్నగుట్ట మల్లికార్జున స్వామి సన్నిధిలో పసుపు కొమ్ము కట్టుకుని పెళ్లి చేసుకున్న కొన్ని గంటల సమయంలోనే ఈ అఘారుుత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం బస్వాపూర్‌కు చెందిన నాచారం సుగుణ, కుమారుడు రమేశ్ (24) బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం అదే మండలంలోని దూలపల్లికి వెళ్లారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గంగోజిపేటకు చెందిన కుమ్మరి లింగయ్య, లక్ష్మి దంపతులు ఐదేళ్ల క్రితం దూలపల్లికి వలస వెళ్లి ఓ కంపెనీలో పని చేసుకుంటూ జీవిస్తున్నారు.


కూమార్తె మాధవి (17)ని స్థానిక ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కాలేజీలో సీఈసీ సెకండ్ ఇయర్ చదివిస్తున్నారు. సొంతంగా ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. లింగయ్య ఇంట్లోనే సుగుణ, రమేశ్ కిరారుుకి ఉంటున్నారు. సుగుణ ఓ కంపెనీలో కూలీ పని చేస్తుండగా.. రమేశ్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. మాధవి, రమేశ్ ప్రేమించుకోవడంతో మాధవి తల్లిదండ్రులు మందలించి వారిని ఇల్లు ఖాళీ చేరుుంచారు. దీంతో వారు వేరే ఇంట్లో ఉంటున్నా రమేశ్, మాధవి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది. దీన్ని గమనించిన మాధవి తల్లిదండ్రులు నెల రోజుల క్రితం ఆ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.

తన కూమార్తెకు 17 సంవత్సరాలే ఉన్నందున ఇంటర్ పూర్తి కాగానే 18 సంవత్సరాలు నిండుతాయని, ఆ తరువాత పెళ్లి చేస్తామని మాధవి తల్లిదండ్రులు తెలిపారు. దీంతో సుగుణ, రమేశ్ అక్కడి నుంచి బస్వాపూర్‌కు తిరిగివచ్చారు. కాగా శనివారం మల్లన్నగుట్టలో మాధవి, రమేశ్ పెళ్లి చేసుకున్నారు. అంతలోనే శవాలుగా కనిపించడంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నారుు. పెద్దలు ప్రేమపెళ్లిని నిరాకరించడం వల్లే ఆత్మహత్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top