వడదెబ్బతో లారీలోనే కన్నుమూసిన డ్రైవర్
ఇచ్చోడ (ఆదిలాబాద్) : సరుకులు చేరవేసేందుకు రాష్ట్రం దాటి వచ్చిన ఓ లారీ డ్రైవర్ వడదెబ్బకు గురై డ్రైవింగ్ సీటులోనే తనువు చాలించాడు. మధ్యప్రదేశ్కు చెందిన లారీ (కంటెయినర్) డ్రైవర్ విష్ణుప్రసాద్ (35) లోడ్తో హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వైపునకు వెళ్తున్నాడు. సోమవారం మధ్యాహ్నమంతా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు.
ఎండకు తోడు లారీ క్యాబిన్లో వేడి పెరగడంతో విష్ణుప్రసాద్కు వడదెబ్బ తగిలింది. లారీ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బైపాస్ సమీపంలోకి రాగానే విష్ణుప్రసాద్ లారీని పక్కకు ఆపి.. సీట్లోనే పడిపోయి.. వాంతులు చేసుకున్నాడు. డ్రైవింగ్ సీటులోనే కన్నుమూశాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని, కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశారు.