లారీ-బస్సు ఢీ.. 8 మందికి గాయాలు


గంగవరం: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్న ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలం మబ్బువాళ్లపేట సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. మదనపల్లి నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top