తుని వద్ద వంతెనపై నుంచి పడిపోయిన లారీలు
తూర్పు గోదావరి జిల్లా తుని కాంప్లెక్స్ వద్ద శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అన్నవరం నుంచి విశాఖ వైపు వెళుతున్న కంటెయినర్ అండర్పాస్ వంతెనపై ఆగి ఉన్న జీడిపిక్కల లోడు లారీని ఢీకొంది. దీంతో రెండు లారీలు వంతెనపై నుంచి కిందకు పడిపోయాయి. ఒకరు మృతి చెందారు. పోలీసులు, హైవే సిబ్బంది కలసి లారీలను పక్కకు తప్పించే చర్యలు చేపట్టారు.