లోక్ అదాలత్లో 20 కేసుల పరిష్కారం
ఖమ్మంలీగల్: జిల్లా న్యాయసేవల సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.తిరుమలాదేవి అధ్యక్షతన సోమవారం జరిగిన లోక్అదాలత్లో 20 మోటారు వాహన ప్రమాద కేసులు పరిష్కారం అయ్యాయి. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.41.89లక్షల పరిహారం చెల్లించడానికి బీమా కంపెనీ అధికారులు అంగీకరించారు. జాతీయ లోక్అదాలత్లో కక్షిదారులు హాజరు కానందున పరిష్కారానికి నోచుకోలేకపోయిన రోడ్డు ప్రమాద కేసుల పరి ష్కార నిమిత్తం ఈ లోక్ అదాలత్ను నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయసేవా సంస్థ కార్యదర్శి వీఏఎల్ సత్యవతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారుపల్లి గంగాధర్ పాల్గొన్నారు.