చర్ల అటవీ ప్రాంతంలో పేలిన మందుపాతర

చర్ల అటవీ ప్రాంతంలో పేలిన మందుపాతర - Sakshi


చర్ల(ఖమ్మం): ఖమ్మం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం-ఛత్తిస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల పోస్టర్లు ఏర్పాటు చేసిన ప్రాంతంలో మందుపాతర పేలడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.



బూటకపు ఎన్‌కౌంటర్‌లకు నిరసనగా మావోయిస్టులు ఈరోజు తెలంగాణ బంద్‌ను పాటిస్తున్నారు. ఇందులో భాగంగా చెర్ల అటవీ ప్రాంతంలో బంద్ పోస్టర్లు ఏర్పాటు చేసిన చోట టిఫిన్ బాక్స్ బాంబ్ పేల్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top