ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలు: హరీశ్
సిద్దిపేట జోన్: ఈ ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు వెల్లడించారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో గ్రూప్-2 ఉచిత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ 6 నెలల నుంచి ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్వహించే నియామక ప్రక్రియల్లో యువత ధృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో పాల్గొని ఉద్యోగాలను సాధిం చాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీజేఆర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ జగదీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.