చొక్కారామ్ కుటుంబాన్ని ఆదుకుంటాం
► అంత్యక్రియలకు హాజరైన మంత్రి కేటీఆర్
► కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి
► అశ్రునయనాలతో తుదివీడ్కోలు
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణానికి చెందిన సీనియర్ దళిత, టీఆర్ఎస్ నాయకుడు కత్తెర చొక్కారాం(55) మృతిపై మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. స్థానిక అంబేద్కర్నగర్కు చెందిన చొక్కారాం గురువారం అనారోగ్యంతో మరణించారు. చొక్కారాం భౌతిక కాయానికి శుక్రవారం అంత్యక్రియలు జరగ్గా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. చొక్కారాం భార్య కత్తెర విజయలక్ష్మి మున్సిపల్ కౌన్సిలర్. ఆయన కుమారుడు నరేశ్, కూతుళ్లు జ్యోత్స్న, అనూష, వైష్ణవిని ఓదార్చారు.
ఆయన కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. చొక్కారాం అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వైస్చైర్మన్ తవుటు కనకయ్య, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, ‘సెస్’ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సుమన్రావు, పీఎస్ శ్రీనివాస్, ప్రత్యేక అధికారి శ్రీధర్, మహేందర్, దళిత నాయకులు కత్తెర దేవదాస్, కె.ధర్మేందర్, స్థానిక కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, భారీగా వచ్చిన స్థానికులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మానేరు తీరం వరకు అంతిమయాత్ర కొనసాగింది.