'ప్రత్యేక హోదాతోనే ఏపీకి పూర్వవైభవం'


నరసాపురం: ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్కు పూర్వవైభవం వస్తుందని, హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష ఆగదని ఆ పార్టీ నేత కొత్త సుబ్బరాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నరసాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.



ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే మేలని భావించినపుడు బీజేపీ, టీడీపీలు ఎన్నికల ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదని సుబ్బారాయుడు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించకపోతే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top