'డీఆర్డీవోకు కలాం పేరు పెట్టండి'
హైదారాబాద్: హైదరాబాద్లోని డీఆర్డీఓకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్తో అబ్దుల్ కలాంకు ఎంతో అనుబంధం ఉందని కేసీఆర్ తెలిపారు.
మనదేశ రక్షణ రంగంలో స్వయం సంవృద్ధి సాధించేందుకు హైదరాబాద్ డీఆర్డీఓలో జరిగిన పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయన్నారు. డీఆర్డీఓకు గతంలో డైరెక్టర్గా పనిచేసిన కలాంపేరు పెట్టడం సముచితం అని భావిస్తున్నామని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.