నేడు కేసీపీ వజ్రోత్సవం

నేడు కేసీపీ వజ్రోత్సవం


లక్ష్మీపురం(చల్లపల్లి)/ఉయ్యూరు : కేసీపీ కర్మాగారాలు స్థాపించి 75 ఏళ్లు పూర్తికావడంతో వజ్రోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా కేసీపీ ఉయ్యూరు, లక్ష్మీపురం చక్కెర కర్మాగారాల చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జి.వెంకటేశ్వరరావు రెండు ప్రాంతాల్లోనూ విలేకరులతో మాట్లాడారు. కేసీపీ సంస్థకు శక్తి, ఆస్తి రైతులు, కార్మికులేనని చెప్పారు. జిల్లాలో పారిశ్రామికీకరణకు దివంగత వెలగపూడి రామకృష్ణ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. లక్ష్మీపురం, ఉయ్యూరు, చాగల్లు, జగ్గయ్యపేట, మాచర్ల తదితర ప్రాంతాల్లో కర్మాగారాలు స్థాపించి యువతకు ఉద్యోగాలు కల్పించారని, రైతు, కార్మికులకు మేలు చేశారని చెప్పారు. వజ్రోత్సవం సందర్భంగా కర్మాగారాల ఆవరణలో జరిగే వేడుకల్లో ఉత్తమ రైతులు, కార్మికులకు పతకాలను అందిస్తామని తెలిపారు. విద్యార్థులతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా చేయూతనందిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో లక్ష్మీపురం కేసీపీ ప్రాసెసింగ్‌ జీఎం జి.బుల్లిపిచ్చియ్య, డీజీఎం మండవ రామ్మోహనరావు, ఉయ్యూరు కేసీపీ జీఎంలు వీవీ పున్నారావు(కేన్‌), సీకే వసంతరావు(ఫైనాన్స్‌), శ్రీహరిబాబు(ప్రాసెస్‌), హెచ్‌ఆర్‌ మేనేజర్‌ దాస్, కేన్‌ మేనేజర్‌ పాలడుగు వెంకటేశ్వరరావు, కార్మిక సంఘం అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రత్యేక సీఎస్‌ రాక

లక్ష్మీపురం కేసీపీ కర్మాగారంలో జరిగే వజ్రోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పీవీ రమేష్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అతిథులుగా ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రా షుగర్స్‌ ఎండీ పెండ్యాల అచ్యుతరామయ్య, కేసీపీ ఎండీ వెలగపూడి ఇర్మ్‌గార్డ్‌ పాల్గొంటారు.  







 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top