ఓవరాల్ చాంపియన్గా జేబీ కళాశాల
-
ముగిసిన అంతర్ కళాశాలల క్రీడా పోటీలు
గూడూరు: డీఆర్డబ్ల్యూ కళాశాలలో రెండు రోజులగా జరుగుతున్న 2016 – 17 అంతర్ కళాశాలల మహిళా క్రీడా పోటీలు మంగళవారంతో ముగిశాయి. కావలి జేబీ కళాశాల అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. ముగింపు కార్యక్రమంలో వీఎస్యూ రిజిస్ట్రార్ శివశంకర్ మాట్లాడారు. క్రీడల్లో మహిళలు నైపుణ్యం సాధించాలని పేర్కొన్నారు. పీవీ సింధూను ఆదర్శంగా తీసుకొని క్రీడాకారిణులు ప్రయత్నిస్తే విజయం తథ్యమన్నారు. క్రీడాప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం కళాశాల ప్రత్యేకాధికారి మెహర్మణి మాట్లాడారు. తక్కువ వ్యవధిలో క్రీడా పోటీలను నిర్వహించేందుకు తమ కళాశాలకు అవకాశం ఇచ్చిన విక్రమ సింహపురి వర్సిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి, వీఎస్యూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి చంద్రమోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ రేవతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి విజయకళ, తదితరులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు..
కావలి జేబీ కళాశాల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారు. బాస్కట్బాల్ విన్నర్లుగా నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాల, రన్నర్లుగా గూడూరు డీఆర్డబ్ల్యూ కళాశాల, కబడ్డీలో విజేతలుగా కావలి జేబీ కళాశాల, రన్నర్లుగా నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాల, బాల్బ్యాడ్మింటన్లో విన్నర్లుగా గూడూరు డీఆర్డబ్ల్యూ కళాశాల, రన్నర్లుగా నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాల నిలిచింది. వాలీబాల్లో విన్నర్స్గా డీకేడబ్ల్యూ, రన్నర్స్గా జేబీ కళాశాల, ఖోఖోలో విన్నర్లుగా డీకేడబ్ల్యూ కళాశాల, రన్నర్లుగా డీఆర్డబ్ల్యూ, టేబల్టెన్నిస్ డబుల్స్, సింగిల్స్లో విజేతగా జేబీ కళాశాల, రన్నర్స్గా నెల్లూరు సర్వోదయ, రింగ్బాల్ విన్నర్స్గా గూడూరు డీఆర్డబ్ల్యూ కళాశాల, రన్నర్స్గా జేబీ కళాశాల, టెన్నిస్ విన్నర్గా జేబీ కళాశాల,lరన్నర్స్గా గూడూరుకు చెందిన డీఆర్డబ్ల్యూ కళాశాలలు నిలిచాయి.