తుమ్మలపల్లి కళాక్షేత్రం పనులు పూర్తి చేయండి


విజయవాడ సెంట్రల్‌ : నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆధునికీకరణ పనులను మునిసిపల్‌ కమిషనర్‌ జి.వీరపాండియన్‌ పరిశీలించారు. వాల్‌ప్లానింగ్, ఎలక్ట్రికల్, ఏసీ, వాల్‌ పెయింటింగ్, ఫ్లోరింగ్, సౌండ్‌ సిస్టం, ఎలివేషన్, సీలింగ్‌ లైటింగ్, ప్రొజెక్టర్లు, సీటింగ్‌ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తికావాలని సూచించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. కళాక్షేత్రం చుట్టూ ప్రహరీని వెంటనే తొలగించాలన్నారు. చీఫ్‌ ఇంజినీర్‌ ఎంఎ.షుకూర్, ఈఈ పి.వి.కె.భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top