'కృష్టపట్నం భూములు కొట్టేసేందుకు కుట్ర'


నెల్లూరు : టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ కేవలం ప్రచార ఆర్భాటమే అని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ట అధ్యక్షుడు కాకాని గోవర్దన్రెడ్డి ఆరోపించారు. బుధవారం నెల్లూరులో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..  వాస్తవానికి రైతులకు రుణమాఫీ జరగడం లేదన్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణపట్నం ఎరువుల ఫ్యాక్టరీ కోసం చైనాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గ్యాస్ లేకుండా పరిశ్రమ ఎలా వస్తుందో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. కృష్ణపట్నం భూములను కొట్టేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top