ప్రాణాలు పోయినా భూములు వదులుకోం..


చిత్తూరు : చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి ప్రాంతంతో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి ప్రాణాలు పోయినా భూములు వదులుకోమని రైతులు తీర్మానించారు. బుధవారం కడపల్లి విమానాశ్రయం ప్రాంతంలో భూములు కోల్పోనున్న ఐదు గ్రామాలకు చెందిన రైతులు సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా 32 మందితో ఒక కమిటీని ఎన్నుకున్నారు.  ప్రాణాలు పోయినా, జైళ్లకు వెళ్లాల్సి వచ్చినా భూములు మాత్రం ఇవ్వబోమని కమిటీ తీర్మానించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top