కబడ్టీ జిల్లా జట్ల ఎంపిక
వీరవాసరం : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశామని జిల్లా కబడ్డి అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.రామచంద్రయ్య తెలిపారు. వీరవాసరం మండలం కొణితివాడ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన కబడ్డీ ఎంపిక పోటీల్లో జిల్లా జట్టుకు అత్యంత ప్రతిభావంతులను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన విద్యార్థులకు 15 రోజుల పాటు కబడ్డీలో ప్రత్యేక శిక్షణ అందిస్తామని చెప్పారు. వచ్చేనెల 20 నుంచి 23వ తేదీ వరకూ విశాఖపట్టణంలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. జిల్లా కబడ్డీ సెలక్షన్ కమిటీ కన్వీనర్ చినమిల్లి నాయుడు, చైర్మన్ ఎన్వీ ఆర్దాస్, కార్యదర్శి ఎం.రంగారావు, సర్పంచ్ యరకరాజు చినబాబు, సంయుక్త కార్యదర్శులు మల్లేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, ఎం.రంగారావు, వైఎస్సార్ సీపీ నాయకులు నాగరాజు వెంకట శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా బాలుర జట్టు
తోట వంశీ, తోట కుమార్(తోలేరు హైస్కూల్), ఎం.లీలా కష్ణ(దేవరపల్లి), వి.ప్రవీణ్కుమార్ (కొణితివాడ), ఎం.నవీన్, పి.వంశీకష్ణ, బి.ప్రసాద్(కెఆర్ పురం), ఎం.రామకష్ణ (విజయరాయి), ఎం.ప్రసాద్ (కోపల్లె), ఎల్.సునీల్ బాబు, ఆర్.రాజేష్ (ఉండ్రాజవరం), పి.మధు (పెదపాడు), జి.సాయిరాం (నిడదవోలు), డి.జగపతిబాబు (తాడేరు), ఎన్.అనిల్ (గునుపూడి)
జిల్లా బాలికల జట్టు
ఐ.పద్మజ, కె.జయలక్ష్మి, కె.మౌనిక, కె.జ్యోతి ప్రవల్లిక(తోలేరు), బి.సంధ్య (యర్నగూడెం), జి.రేవతి దేవి (తణుకు), కె.లక్ష్మి, పి.లీలా సుప్రియ(సెయింట్ మేరీస్), డి.గౌతమి, ఎస్.సురేఖ(పోలసానిపల్లి), బి.రేవతి (దొంగపిండి), జి.కనకదుర్గ పి.మధు(ఎన్నార్పీ అగ్రహారం), కె.దివ్య, ఎం.మౌనిక(తాడేపల్లి గూడెం)