జాతీయ రహదారిపై బారులు తీరిన వాహనాలు


తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంట ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద అక్రమాలు పెరిగిపోయాయి. ఈ విషయంపై నిఘా పెట్టిన మీడియా ప్రతినిధులు కవరేజ్ కోసం వెళ్లారు. లంచాలు తీసుకుంటుండగా ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ విషయాన్ని గ్రహించిన చెక్ పోస్ట్ అధికారులు మీడియా వారిపై దాడికి పాల్పడ్డారు. తమపై జరిగిన దాడికి నిరసనగా రేణిగుంట-చెన్నై రహదారిపై జర్నలిస్టులు ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై 4 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top