జోగురామన్నకు పితృవియోగం
తెలంగాణ అటవీశాఖా మంత్రి జోగురామన్న తండ్రి జోగు ఆశన్న(95) బుధవారం మధ్యాహ్నాం తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు కన్ను మూశారు. దీంతో మంత్రి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. స్వగ్రామం జైనత్ మండలం దీపాయిగూడలో గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి.