జేసీబీ దగ్ధం చేసిన మావోయిస్టులు?


ములుగు: వరంగల్ జిల్లా ములుగు మండలం మల్లంపల్లి వద్ద ఎర్రమట్టి క్వారీ కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీకి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో జేసీబీ పూర్తిగా దగ్ధం అయింది. ఏటూరునాగారంలో పలువురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల తర్వాత జరిగిన ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.



పోలీసుల దృష్టి మార్చడానికే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top