మంచిర్యాల జేసీ వాహనం ఢీకొని ఒకరికి..


పెద్దపల్లిరూరల్‌ : పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద రాజీవ్‌రహదారి దాటుతున్న ఓ వ్యక్తిని మంచిర్యాల జాయింట్‌ కలెక్టర్‌ సుధాకర్‌ వాహనం ఆదివారం ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కమాన్‌ ప్రాంతంలో నివాసముండే బాల ఏసు (52) బస్టాండ్‌ ఎదురుగా రాజీవ్‌రహదారి దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అవతలి వైపు వాహనం రావడం గమనించిన ఏసు వెనక్కి మళ్లడంతో జేసీ వాహనం అతడిని ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమైన బాధితుడిని 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్‌కు తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top