'బీజేపీలోకి ఎందుకు వెళ్లానో నాకే తెలియదు'
హైదరాబాద్:గతేడాది బీజేపీలో చేరిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) సోమవారం కాంగ్రెస్ లో పార్టీలో చేరారు. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి కుంతియాల సమక్షంలో జగ్గారెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తాను బీజేపీలోకి ఎందుకు వెళ్లానో తనకే తెలియదన్నారు. 2019లో సంగారెడ్డి ప్రజలు నన్నే గెలిపిస్తారని జోస్యం చెప్పారు. తన నోటి దురుసు, ఉద్యోగుల వ ల్లే గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పునాదులు కదిలే రోజు త్వరలో వస్తుందన్నారు. ఇక నుంచి సంగారెడ్డికి రావాలంటే మంత్రులు ఆలోచించుకోవాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఇకపై టీఆర్ఎస్ గుండెలు అదిరిపోయేలా కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు.