'బీజేపీలోకి ఎందుకు వెళ్లానో నాకే తెలియదు'

'బీజేపీలోకి ఎందుకు వెళ్లానో నాకే తెలియదు' - Sakshi


హైదరాబాద్:గతేడాది బీజేపీలో చేరిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)  సోమవారం కాంగ్రెస్ లో పార్టీలో చేరారు. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి కుంతియాల సమక్షంలో జగ్గారెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. 


 


ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తాను బీజేపీలోకి ఎందుకు వెళ్లానో తనకే తెలియదన్నారు. 2019లో సంగారెడ్డి ప్రజలు నన్నే గెలిపిస్తారని జోస్యం చెప్పారు. తన నోటి దురుసు, ఉద్యోగుల వ ల్లే గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమని  పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పునాదులు కదిలే రోజు త్వరలో వస్తుందన్నారు. ఇక నుంచి సంగారెడ్డికి రావాలంటే మంత్రులు ఆలోచించుకోవాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఇకపై టీఆర్ఎస్ గుండెలు అదిరిపోయేలా కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top