రేపు టీటీడీసీలో జాబ్‌మేళా


అనంతపురం టౌన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో ఈనెల 22న టీటీడీసీలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. 18 నుంచి 21 ఏళ్లలోపు ఉన్న యువకులు ఎంపీసీ/బైపీసీలో 60 శాతం ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top