ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య


సెల్‌ఫోన్ విషయమై మిత్రులతో గొడవపడిన ఓ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని లయోలా కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన కమల్‌జైన్ లయోలా కళాశాల హాస్టల్‌లో ఉండి ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.


 


గురువారం ఇతనికి సెల్‌ఫోన్ విషయమై తోటి వారితో గొడవజరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన కమల్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top