తండ్రి మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య


శంషాబాద్‌: చదువుకోవడం లేదని తండ్రి మందలించడంలో మనస్తాపానికి గురై ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ మండల కేంద్రంలోని రుద్రా కాలనీలో అద్దెకు నివాసముంటు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటు కుమారుడు శేఖర్‌ను ఇంటర్ చదివిస్తున్నాడు.


స్థానికంగా ప్రయివేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసిన శేఖర్ ఇటీవల వచ్చిన ఫలితాల్లో తప్పడంలో గురువారం ఉదయం తండ్రి అతడిని పిలిచి చదువుకోవాలని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శేఖర్ ఇంట్లో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top