మురికి కాలువలో చిన్నారి మృతదేహం
తగరపువలస(విశాఖపట్నం): డ్రైనేజీలో ఐదునెలల బాబు మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా తగరపువలస మండలం చిట్టివలస గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది.
వివరాలు.. గ్రామంలోని మురికి కాలువలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. సుమారు నాలుగు ఐదు నెలల వయసు ఉన్న బాలుడు రెండు రోజుల కిందటే కాలువలో పడి ఉంటాడని తెలిపారు. బాబు తల్లిదండ్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
సంబంధిత వార్తలు