కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
colleges, vigilence, check
గోదావరిఖని కళాశాలలు, తనిఖీ, విజిలెన్స్
గోదావరిఖనిటౌన్ : పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలను విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీ చేశారు. మార్కండేయకాలనీలోని కృష్ణవేణి వికాస్, చైతన్య ఇతర కళాశాలలో తరగతి గదుల కొలతలు, కళాశాలలను నిర్వహించే హాజరు పట్టిక, స్కాలర్షిప్, ఇతర అంశాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి కళాశాల చెందినవిషయాలు తెలుసుకున్నారు. అసౌకర్యాలు లేకుండా విద్యార్థులకు అన్ని సేవలు అందే విధంగా చూడాలని కళాశాల నిర్వాహకులను కోరారు. కార్యక్రమంలో అధికారులు సత్యానారయణ, కళాశాల డైరెక్టర్ కుమార్, తిరుపతి, ప్రిన్సిపాల్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.