మాది రైతు పక్షపాతి ప్రభుత్వం: కడియం

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం: కడియం - Sakshi


మహబూబాబాద్: రైతు పక్షపాతి టీఆర్ఎస్ ప్రభుత్వమని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతోందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు గూడూరులో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం గాంధీపార్కులో జరిగిన సభలో కడియం మాట్లాడారు. గోదావరి, కృష్ణాజలాల నికర జలాల విషయంలో గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గోదావరి, కృష్ణాపై కాళేశ్వరం, ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులు ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ప్రాజెక్టులు పూర్తరుుతే భవిష్యత్ ఉండదని కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగుతోందన్నారు. రూ. 500, 1000 నోట్లను రద్దుతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిందన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top