రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా - Sakshi


మంత్రి పల్లె రఘునాథరెడ్డి



 సాక్షి, అమరావతి: తనపై వస్తున్న ఆరోపణలు రుజువుచేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, త్వరలోనే తాను ఆస్తులు ప్రకటిస్తానని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన ఆస్తుల విషయంలో సాక్షి మీడియా కథనాల్లో వాస్తవాలు లేవని, తనపై ప్రచురించిన వార్తల విషయంలో సాక్షి మీడియాకు నోటీసులిస్తానని చెప్పారు.



ఆరోపణలు రుజువు చేయకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను భూదందాలు, రౌడీయిజం చేయలేదన్నారు. విద్యా సంస్థలను నిర్వహించి సంపాదించుకున్నానని చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top