'పవన్ కల్యాణ్ తో మాట్లాడతా'

'పవన్ కల్యాణ్ తో మాట్లాడతా' - Sakshi


విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోదీతో గంటన్నరసేపు చర్చలు జరిపినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర సమస్యల గురించి ప్రధానికి వివరించినట్టు చెప్పారు. బుందేల్ ఖండ్ కన్నా మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. నీతి ఆయోగ్ ద్వారా త్వరలో రోడ్ మ్యాప్ ఇస్తామన్నారని వెల్లడించారు. ప్రత్యేక హోదాపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.



గురువారం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ... హైదరాబాద్ లో చదువుకున్న వారికి స్థానికతపై 6.1 ఫార్ములాకు 15 రోజుల్లో సవరణలు తీసుకొస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. అవసరమైతే దీనిపై పవన్ కల్యాణ్ తో కూడా మాట్లాడాతానని చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని, పట్టిసీమను వ్యతిరేకించడం తగదన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top