నన్ను పార్టీ పదవి నుంచి తొలగించినా సరే..
కానీ, మంచి నాయకున్ని నియమించాలి: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తనను కన్వీనర్ పోస్టు నుంచి తొలగించినా ఎలాంటి అభ్యంతరం లేదని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. కానీ, మంచి నాయకున్ని నియమించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో తెలంగాణకు ప్రత్యేక కమిటీని నియమించడం ద్వారా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి, పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నారు. వారంలోగా తెలంగాణ టీడీపీకి పూర్తిస్థాయి కమిటీల నియామకం పూర్తవుతుందని, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లను పార్టీ అధినేత చంద్రబాబు నియమిస్తారని చెప్పారు.