'నేను ఫోర్ ట్వంటీని కాదు'
రామచంద్రాపురం: ‘‘నేనేం ఫోర్ ట్వంటీ (420)ని కాదు.. తండ్రికి చెడ్డపేరు తెచ్చిపెట్టేలా ప్రవర్తించను.. మీరు పార్టీకి అండగా ఉంటే మీకు నేను అండగా ఉంటా’’ అంటూ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహా నాడు విజయవంతం చేశారంటూ టీడీపీ వాలంటీర్లకు శుక్రవారం చిత్తూరు జిల్లా రామచంద్రాపురంలో సన్మాన సభ నిర్వహిం చారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న లోకేశ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్కు సవాల్ విసిరారు. అనంతరం లోకేశ్ను మండల టీడీపీ నాయకులు గజపూలమాల, కిరీటంతో సన్మానించారు. మాజీమంత్రి గల్లా అరుణకుమారి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడారు. కాగా కార్యక్రమానికి మండలానికే చెందిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు హాజరుకాలేదు. గల్లా అరుణకుమారితో విభేదాల నేపథ్యంలో గాలి వర్గానికి చెందిన పలువురు సభకు హాజరు కాలేదు.