యాదాద్రిలో కూలిన భారీ వృక్షం


యాదగిరికొండ(నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి విష్ణు పుష్కరిణి సమీపాన ఉన్న భారీ వృక్షం నేల కూలింది. చుట్టుపక్కల ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఏన్నో ఏళ్లుగా ఉన్న ఈ రావి చెట్టు యాదాద్రిలో పూజలందుకుంటోంది. చెట్టు కూలడంతో విష్ణు పుష్కరిణిలో స్నానానికి వెళ్లలేక భక్తులు వెనుదిరిగారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top