ఆరుగురు దొంగల అరెస్ట్‌

ఆరుగురు దొంగల అరెస్ట్‌ - Sakshi

కరీంనగర్‌:  నగర పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి సుమారు రూ.9.82 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు, తొమ్మది సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కరీంనగర్‌ పరిధిలో జరిగిన ఇరవై నాలుగు  చోరీ కేసుల్లో నిందితులు. 

 

దొంగలను పట్టుకోవడంలో విజయం సాధించిన పోలీసులకు  నగర కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి రివార్డులను ప్రకటించారు. నిందితులను ప్రెస్‌ మీట్‌ అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top