నిరుపేదలకు దశలవారీగా ఇళ్లు: కవిత


కరీంనగర్: ఇల్లు లేని నిరుపేదలకు దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ ఎంపీ కవిత ప్రకటించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం నర్సింగాపూర్ లో పలు అభివృద్ధి పనులకు ఆమె శనివారం శంకుస్థాపన చేశారు. జగిత్యాలలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇల్లు లేని పేదలకు  ప్రభుత్వం దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, సీనియర్ నేత జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top