కడుపునొప్పితో హెచ్‌ఎం మృతి


గండీడ్ (రంగారెడ్డి జిల్లా) : గండీడ్ మండలం రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే హెచ్‌ఎం విజయలక్ష్మి కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆమె కుటుంబసభ్యులు మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు. విజయలక్ష్మి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్రం చోటుచేసుకుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top