బెజవాడ కనకదుర్గ ఆలయానికి పోటెత్తిన భక్తులు


విజయవాడ : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీ పంచమి నేపథ్యంలో అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిపోయింది. అమ్మవారు సరస్వతి అవతారంలో దర్శనమిస్తున్నారు. అయితే శ్రీపంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై విజయిభవ మహాసరస్వతియాగం నిర్వహిస్తున్నారు.  ఈ యాగానికి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అమ్మవారి ఆశీస్సులు అందించేందుకు ఈ యాగం నిర్వహిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top