మాచర్ల పట్టణంలో భారీ వర్షం


మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో మంగళవారం రాత్రి 9గంటల నుంచి అరగంట సేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షం భారీగా కురవడంతో కాల్వలు, రోడ్లు నీట మునిగాయి. మాచర్ల రింగ్‌రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డు, ప్రభుత్వ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో అడుగు లోతు వరకు నీరు చేరింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారమైంది.



భారీగా కురిసిన వర్షంతో ఇప్పటి వరకు ఎండలకు అల్లాడుతున్న ప్రజలు సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాచర్ల పర్యటించి వెళ్లడం వల్లే వర్షం కురిసిందని హర్షం వ్యక్తం చేశారు. మంచినీటికి కటకటలాడుతున్న ప్రజలు జగన్ అన్న వచ్చారు... వర్షం కురిసింది. వైఎస్ జగన్ వస్తే వర్షం వస్తుందని పలువురు కేరింతలు కొడుతూ ఆనందపడ్డారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top